అదొక పల్లెటూరు.
రచ్చబండ దగ్గర రాత్రి పదిగంటల వరకు బాతాఖానీ వేసి లేచారు గ్రామపెద్దలంతా. అప్పటివరకు కరెంటు కష్టాల గురించీ, జగన్ ఓదార్పు యాత్రల గురించీ చర్చించి, రాబోవు ఉప ఎన్నికల గురించి, కబుర్లు చెప్పుకుని అలసిపోయి నిద్ర ముంచుకురావడంతో ఇళ్లకు బయలుదేరారు.
తుండు తీసి దులిపి భుజాన వేసుకుని తన ఇంటివైపు నడిచాడు గిరినాయుడు.
చీకటి పడగానే అన్నం తిని రావిచెట్టు కింద రచ్చబండ మీదకి చేరడం ఆఊరి పెద్దలకలవాటు.